24 January 2020

అబిద్ హసన్ Abid Hasan అబిద్ హసన్ "సఫ్రానీ" INA



Image result for abid hussain azad hind fauj 
సుబ్ సుఖ్ చైన్, జై హింద్ సృష్టి కర్త

అబిద్ హసన్ గా  పిలువబడే జైన్-అల్-అబ్దిన్ హసన్, జూన్ 11, 1911లో హైదరాబాద్ (దక్కన్) లో జన్మించారు. అబిద్ హసన్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదువు కొన్నారు మరియు అజాద్ హింద్ ఫౌజ్ /ఇండియన్ నేషనల్ ఆర్మీ (1942-1945),భారత విదేశీ సేవ/IFS (1948-1969)లో పనిచేసారు.
.

హైదరాబాద్‌లో విద్యను  అబ్యసించిన అబిద్ హసన్ ఇంజనీర్‌గా శిక్షణ కోసం జర్మనీకి వెళ్లారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అతను జర్మనీలో విద్యార్థిగా ఉన్నప్పుడు, అబిద్ హసన్ సుభాస్ చంద్రబోస్‌ను కలుసుకున్నాడు మరియు ఇండిస్ లెజియన్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. బోస్ జర్మనీలో ఉన్నప్పుడు హసన్ తరువాత బోస్ వ్యక్తిగత కార్యదర్శి మరియు అనువాదకుడిగా పనిచేశాడు. సౌత్ ఈస్ట్ ఆసియాకు బోస్ చేసిన ప్రయాణంలో 1943 లో జర్మన్ U- బోట్ U-180 లో బోస్ తో కలిసి హసన్ ప్రయాణించారు. హసన్ ఆజాద్ హింద్ ఫౌజ్లో మేజర్గా ఎదిగాడు. ఈ సమయంలోనే అతను పవిత్ర హిందూ రంగు కుంకుమపువ్వు "సఫ్రానీ" ను తన పేరుకు మత సామరస్యాన్ని గుర్తుగా స్వీకరించాడు.


 "జై హింద్" నినాదం:
 జై హింద్!అనే పద౦ ఎలా ఉనికిలోకి వచ్చిందో మీకు తెలుసా?
నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎ) లో చేరిన హైదరాబాద్ కు చెందిన అబిద్ హసన్ సఫ్రానీ అనే వ్యక్తి యొక్క ఆలోచన జై హింద్!’.

అబిద్ ఇంజనీరింగ్ చదవడానికి UK కి బదులుగా జర్మనీ వెళ్ళాడు.జర్మనీలో జరిగిన భారత యుద్ధ ఖైదీల సమావేశంలో ప్రసంగించినప్పుడు అతనికి  బోస్‌తో పరిచయం ఏర్పడ్డాడు. బోస్ యొక్క ఉత్తేజకరమైన ప్రసంగం అబిద్ తన చదువు పూర్తి చేసిన తరువాత INA లో చేరాలని ప్రభావితం అయినది. అబిద్ 1941 లో బోస్ కార్యదర్శి మరియు అనువాదకుడిగా మారడానికి తన కోర్సును విడిచిపెట్టాడు.

అబిద్ బోస్ యొక్క సన్నిహితుడు అయ్యాడు మరియు అతనికి INA లో మేజర్ పదవి ఇవ్వబడింది. సాంప్రదాయకంగా వారి జాతులు మరియు మతం ఆధారంగా రెజిమెంట్లుగా విభజించబడిన సైనికులను పలకరించడానికి ఒక సాధారణ పదo సృష్టించే పని అతనికి ఇవ్వబడింది.

ఠాకూర్ యశ్వంత్ సింగ్ "హిందుస్తాన్ కి జై" అని సూచించారు, కాని ఇది చాలా పొడవుగా ఉందని అబిద్ హసన్ భావించి, "జై హింద్" ను ప్రత్యామ్నాయంగా సూచించారు. ఈ పదాన్ని చెంపకరమన్ పిళ్ళై ఇంతకుముందు ఉపయోగించారు.

చర్చల తరువాత అబిద్ హసన్ సూచించిన "జై హింద్" నినాదం విప్లవకారులను మరియు INA లోని ఇతర సభ్యులను పలకరించేందుకు  నమస్కారంగా వాడబడినది. దీనికి బోస్ ఇష్టపడ్డారు మరియు స్వీకరించారు. దీనిని అందరు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ పదం తరువాత భారతదేశ స్వాతంత్ర్యం తరువాత జాతీయ నినాదంగా ఉద్భవించింది. జవహర్‌లాల్ నెహ్రూ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ట్రైస్ట్ విత్ డెస్టినీలో కూడా జై హింద్  ఉపయోగించారు.

యుద్ధం ముగింపులో  భారతదేశానికి స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత, 1946 లో ఐఎన్ఎ ట్రయల్స్ ముగిసిన తరువాత అబిద్ హసన్ విడుదలయ్యాడు మరియు కొంతకాలం భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. విభజన తరువాత, హసన్ హైదరాబాద్లో ఉంటూ నూతన భారత విదేశాoగ సేవలో చేరాడు. సుదీర్ఘ దౌత్య వృత్తిలో, హసన్ 1969 లో పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడటానికి ముందు ఈజిప్ట్, డెన్మార్క్‌ తో సహా పలు దేశాలకు భారత రాయబారిగా పనిచేశారు.

నేతాజీ బోస్ మేనల్లుడు అరబిందో బోస్ తరువాత సఫ్రానీ మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు సురయ హసన్. ఆమె గాంధీజీతో కలిసి పనిచేసిన బద్రుల్ హసన్ (అబిద్ హసన్ సఫ్రిని యొక్క అన్నయ్య కుమార్తె)కుమార్తె.

“సుభ్ సుఖ్ చైన్”:

అబిద్ హసన్ కవి,పండితుడు అతడు పర్షియన్ మరియు ఉర్దూ కవితలను రాసేవాడు. ఇతడు రామ్ సింగ్ ఠాకూరి సంగీతం లో జన గణ మన యొక్క హిందీ-ఉర్దూ అనువాదం “సుభ్ సుఖ్ చైన్” రచిoనాడు. ఇది   తాత్కాలిక భారత ప్రభుత్వ స్వేచ్ఛా గీతం అయింది.

అబిద్ హసన్ సఫ్రానీ 72సంవత్సరాల వయస్సు లో  ఏప్రిల్ 5, 1984 న హైదరాబాద్, తెలంగాణ, లో మరణించారు.






















No comments:

Post a Comment