24 January 2020

అజీముల్లా ఖాన్ Azimullah Khan



Image result for azimullah khan

దేవాన్ అజీముల్లా ఖాన్ అని కూడా పిలువబడే అజీముల్లా ఖాన్ యూసుఫ్జాయ్ (1830-1859) మొదట కార్యదర్శిగా, తరువాత ప్రధానమంత్రి గా ( దివాన్) నానా సాహిబ్‌ వద్ద పనిచేసారు.. అతన్ని క్రాంతిదూత్ (Krantidoot) ("విప్లవ రాయబారి") అజీముల్లా ఖాన్ అని కూడా పిలుస్తారు.

"మదరే వతన్ బారత్ కి జై Mādarē Vatan Bhārat Ki Jai" అన్న నినాదాన్ని 1857 లో అజీమ్ ఉల్లా ఖాన్ ఇచ్చారు.అజీముల్లా ఖాన్ 1857 నాటి భారతీయ తిరుగుబాటులో పాల్గొన్నాడు మరియు  సైద్ధాంతికంగా, నానా సాహిబ్ వంటి వారిని ప్రభావితం చేశాడు.

1837-38 కరువు కాలం లో అజీముల్లా అతని తల్లితో పాటు కాన్‌పూర్‌లోని ఒక మిషన్‌లో ఆశ్రయం పొందాడు. అక్కడ అతను ఇంగ్లీష్ ఫ్రెంచ్ నేర్చుకున్నాడు.

అనేక మంది బ్రిటిష్ అధికారులకు కార్యదర్శిగా పనిచేసిన తరువాత అజీముల్లా దివంగత పేష్వా బాజీ రావు II దత్తపుత్రుడైన నానా సాహిబ్ కు కార్యదర్శిగా మరియు సలహాదారుగా పనిచేసాడు. తన పెంపుడు తండ్రి కి మంజూరు చేసిన, 80,000 పౌండ్ల  వార్షిక పింఛను తనకు అందజేయాలని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నానా సాహిబ్ విజ్ఞప్తి చేశారు. నానా సాహిబ్ పేష్వా బాజీ రావు యొక్క ఆస్తి మరియు బిరుదును వారసత్వంగా పొందనాడు. కంపెనీ పేష్వా బాజీ రావు కు చెల్లించిన పెన్షన్ పేష్వా బాజీ రావు మరణంతో ముగిసింది. 1853 లో నానా సాహిబ్ కంట్రోల్ బోర్డ్ మరియు బ్రిటీష్ ప్రభుత్వానికి తన కేసును వాదించడానికి ఇంగ్లాండ్కు పంపే  ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడానికి అజీముల్లాను ఎంచుకున్నాడు.

ఇంగ్లాండ్‌లో అజీముల్లా కు ఒక మేధావంతురాలు  మరియు అనువాదకురాలు అయిన  లూసీ, లేడీ డఫ్-గోర్డాన్ తో పరిచయం ఏర్పడినది. లేడీ లూసి భర్త ఒక సివిల్ సర్వెంట్ , కోర్టు కార్యనిర్వాహకుడు మరియు అప్పటి ప్రధానమంత్రి బంధువు. ఈ పరిచయం బహుశా తత్వవేత్త జాన్ స్టువర్ట్ మిల్ ద్వారా జరిగింది. జాన్ స్టువర్ట్ మిల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి మరియు లూసీ యొక్క చిన్ననాటి స్నేహితుడు. అజీముల్లా డఫ్ గోర్డాన్స్‌ తో ఎషెర్‌(Esher) లోని వారి ఇంటి వద్ద బస చేశాడు, మరియు లూసీ స్నేహితులు డికెన్స్, కార్లైల్, మెరెడిత్, టెన్నిసన్, బ్రౌనింగ్ మరియు థాకరేలను కలుసుకున్నారు.

నానా సాహిబ్ కోసం పెన్షన్ పున:ప్రారంభం పొందే లక్ష్యం విజయవంతం కాలేదు మరియు ఇది అజీముల్లా ఖాన్‌ను బాదిoచినది.

నిరాశతో తిరుగు ప్రయాణం లో  అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగమైన కాన్స్టాంటినోపుల్‌లో అజీముల్లా బృందం  ఆగిపోయింది. అక్కడ అతను టైమ్స్ కరస్పాండెంట్ విలియం హోవార్డ్ రస్సెల్తో సమావేశమయ్యాడు, బ్రిటిష్ సైన్యం ఎదుర్కొంటున్న నష్టాలు మరియు ఎదురుదెబ్బలపై ముస్లిం యువ అధికారి(అజిముల్లా) ఆసక్తిని గుర్తించాడు. అజీముల్లా టర్కిష్ మరియు రష్యన్ గూడాచారులను సంప్రదించినట్లు సమాచారం.

అతని లక్ష్యం విఫలమైనప్పటికీ, అతను మరింత ప్రమాదకరమైన ఆలోచనతో తిరిగి వచ్చాడు, 1857 నాటి భారతీయ తిరుగుబాటు యొక్క బీజాన్ని నానా సాహిబ్ మనస్సులో నాటాడు. (అజీముల్లా ఒక ఫ్రెంచ్ ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా తిరిగి తీసుకువచ్చాడు, దీనిని ఇతరులు - ముద్రించడానికి మరియు భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విధ్వంసక సాహిత్యాన్ని పంపిణీ కి ఉపయోగించారు చేస్తుంది.)

ఆ తరువాత జరిగిన గొప్ప తిరుగుబాటు(సిపాయిల తిరుగుబాటు)లో అజీముల్లా పాత్ర, సైనికంగా కాకుండా రాజకీయంగా ఉంది. అతను తిరుగుబాటు యొక్క ప్రధాన నాయకులలో ఒకరైన నానా సాహిబ్కు ప్రధాన సలహాదారుగా ఉన్నాడు మరియు కాన్‌పూర్ ముట్టడిని ముగించిన చర్చలలో అతను కీలక పాత్ర పోషించాడు. కాన్పూర్ హత్య కాండ (ఆంగ్ల అధికారులు వారి కుటుంభ సబ్యుల హత్య) లో ఇతని పాత్ర పై సందేహాలు కలవు.   
 అలాగే అతని మరణం పై అనేక సందేహ కథనాలు కలవు.
ఒక కథనం ప్రకారం తిరుగుబాటును అణిచివేసిన తరువాత, 1859 చివరలో అజీముల్లా ఖాన్ నేపాల్ టెరాయ్ పారిపోయాడు మరియు అక్కడ జ్వరంతో మరణించాడు.
మారువేషంలో కలకత్తా చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు మశూచితో మరణిoచినట్లు లేదా భారతదేశం నుండి తప్పించుకొని చివరికి కాన్స్టాంటినోపుల్‌లో హత్యకు గురైనట్టు ఇతర కధనాలు కలవు.
అతని గౌరవార్థం కాన్పూర్ లోని అజీముల్లా అవెన్యూ అని ఒక  రహదారికి పేరు పెట్టారు.
అజీముల్లా ఖాన్‌ను నటుడు షాబాజ్ ఖాన్ 2005 చిత్రం మంగల్ పాండే: ది రైజింగ్ చిత్రంలో పోషించారు.

No comments:

Post a Comment