23 December 2024

భారతీయ రైల్వేలో 54,151 మంది గెజిటెడ్ అధికారులలో 463 మంది ముస్లింలు మాత్రమే ఉన్నారు Indian Railways Has Only 463 Muslims among 54,151 Gazetted Officers

 



న్యూఢిల్లీ :

భారతదేశంలోని ముస్లింలు గ్రౌండ్ రియాలిటీస్ వర్సెస్ ఫేక్ నేరేటివ్స్ అచీవ్‌మెంట్స్ & అకాప్లిష్‌మెంట్స్ Muslims in India – Ground Realities Versus Fake Narratives – Achievements & Accomplishments అనే కొత్త పుస్తకం ప్రకారం 166 ఏళ్ల భారతీయ రైల్వే (ఐఆర్)లోని మొత్తం  1.7 లక్షల మంది ఉద్యోగులతో ముస్లిం అధికారుల సంఖ్య సంతృప్తికరంగా లేదు

·       గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో సహా భారతీయ రైల్వే IR లోని మొత్తం ఉద్యోగుల సంఖ్య జూలై 2023 నాటికి 1,218,221కి చేరుకుంది.

·       2008-09లో అప్పటి రైల్వే మంత్రి భారతీయ రైల్వే IR లో కేవలం రెండు శాతం ముస్లింలు మాత్రమే ఉన్నారని, 140,000 మంది రైల్వే ఉద్యోగులలో 30,000 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారని అన్నారు.

·       2013లో రైల్వేలో 14 లక్షల మంది ఉద్యోగుల్లో 64,000 మంది ముస్లిం ఉద్యోగులున్నారని అధికారులు వెల్లడించారు. 

·       2013లో మీర్జా సల్మా బేగ్ భారతదేశపు మొదటి గేట్ ఉమెన్ అయ్యారు.

·       2016లో, భారతీయ రైల్వేలలో ముస్లిములకు కేవలం 4.5 శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందని, వారిలో 98.7 శాతం మంది తక్కువ స్థాయిలో lower levels ఉన్నారని వెల్లడైంది.

·       రైల్వే బోర్డు ఏప్రిల్ 1951 నుండి 40 మంది చీఫ్‌లను చూసింది  కానీ ముస్లిం సమాజానికి చెందిన వారు ఎవరూ అందులో లేరు.

·       ప్రస్తుతం, రైల్వే బోర్డు GMలతో సహా 40 మంది సభ్యులను కలిగి ఉంది అయినప్పటికీ, రైల్వే బోర్డులో ముస్లింలు లేరు.

·       రైల్వే బోర్డు లో మొత్తం గజెటెడ్ స్టాఫ్ 1,111అందులో 13మంది ముస్లిములు.

·       రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులలోని మొత్తం గజెటెడ్ స్టాఫ్ 51అందులో ముస్లిమ్స్ ఒకరు

·       ఇండియన్ రైల్వే జనరల్ మేనేజర్లు 29 మంది ఉండగా అందులో ఒకరు మాత్రమే  ముస్లిం.

·       భారతీయ రైల్వేలో మొత్తం 54,151 మంది గెజిటెడ్ అధికారులలో కేవలం 463 మంది ముస్లింలు మాత్రమే ఉన్నారు

·       ప్రస్తుతం, తొమ్మిది మంది రైల్వే సేఫ్టీ కమిషనర్‌లు (CRS) ఉన్నారు. ప్రస్తుతం, కమీషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS)లోని 35 మంది అధికారులలో ఒకరు ముస్లిం - అహ్మద్ నదీమ్ సిద్ధిఖీ, రైల్వే సేఫ్టీ డిప్యూటీ కమిషనర్ (మెకానికల్).

భారతీయ రైల్వేలో డేడికేటేడ్  ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) అక్టోబర్ 2006లో ఏర్పాటు చేయబడింది.

·       నేడు, డేడికేటేడ్  ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL లోని 151 మంది మధ్య స్థాయి అధికారులలో ఎనిమిది మంది ముస్లింలు ఉండగా, 39 మంది గల సీనియర్ మేనేజ్‌మెంట్ బృందంలో ఒక్క  ముస్లిం కూడా లేరు.

·       సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS), యొక్క 49 మంది అధికారులలో ఒక ముస్లిం - SAM నఖ్వీ, EPS & MMIS జనరల్ మేనేజర్ ఉన్నారు.

·       డిసెంబర్ 1986లో స్థాపించబడిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లో ముస్లింల సంఖ్య శూన్యం.

·       ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నలుగురు ఉన్నతాధికారులలో ముస్లిములు ఎవరు  లేరు.

·       బ్రైత్‌వైట్ & కో డిసెంబరు 1976లో భారత ప్రభుత్వ రంగ సంస్థగా నమోదు చేయబడి విలీనం చేయబడింది మరియు రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఆగస్టు 2010లో వచ్చింది. నేడు, దాని 23 మంది ఉన్నత అధికారులలో ఒక ముస్లిం - మహమ్మద్ అసద్ ఆలం, ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్.

·    రైల్ వికాస్ నిగమ్ (RVNL) ఎనిమిది మంది సభ్యుల బోర్డు కలిగి ఉంది. అందులో ముస్లిములు ఎవరు  లేరు.

·       రైల్ వికాస్ నిగమ్ (RVNL) లో సీనియర్ ఉద్యోగులుగా 515 మంది ఉద్యోగులు ఉన్నారు వారిలో ఒక్క ముస్లిం కూడా లేరు.

·       సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ (CPSE)లో 95 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మరియు GMలు ఉన్నారు, కానీ అందులో ఎవరూ ముస్లిం కాదు.

1976లో స్థాపించబడిన ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON), మే 2024 నాటికి దాదాపు 1,260 మంది ఉద్యోగులతో దీని పేరు అక్టోబర్ 1995లో ఇండియన్ రైల్వే ఇంటర్నేషనల్ లిమిటెడ్‌గా మార్చబడింది.

·       ఇండియన్ రైల్వే ఇంటర్నేషనల్ లిమిటెడ్‌Indian Railway International Limited యొక్క  34 మంది అధికారులలో ఒకరు మాత్రమే ముస్లిం - మసూద్ అహ్మద్, చీఫ్ జనరల్ మేనేజర్ (HW)

·       RailTel, నిర్వహణ బృందంలో 16 మంది అధికారులు ఉన్నారు కాని అందులో ముస్లిములు ఎవరు లేరు.

   ఇండియన్ రైల్వే లోని 4,498 ప్రధాన విభాగాల అధిపతులలోకేవలం  36 మంది ముస్లింలు

·       ఎనిమిది ఇండియన్ రైల్వే సంస్థలలో  ముస్లిం గెజిటెడ్ అధికారి లేరు

 

మూలం: క్లారియన్ ఇండియా, డిసెంబర్ 22, 2024

 

No comments:

Post a Comment