21 September 2022

భారతదేశపు గొప్ప పరమాణు జీవశాస్త్రవేత్త ఒబైద్ సిద్ధిఖీ (7 జనవరి 1932–26 జూలై 2013)

 

భారతదేశపు గొప్ప పరమాణు జీవశాస్త్రవేత్త ఒబైద్ సిద్ధిఖీ 1932 జనవరి 7న ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జన్మించారు. ఒబైద్ సిద్ధిఖీ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి తన ప్రారంభ విద్యను మరియు మాస్టర్ ఆఫ్ సైన్స్  డిగ్రీ ని  పూర్తి చేసాడు మరియు గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్  డిగ్రీని పొందాడు.

హోమీ జహంగీర్ భాభా 1962లో ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో అటామిక్ బయోలాజికల్ యూనిట్‌ను ఏర్పాటు చేయమని ఒబైద్ సిద్ధిఖీని  ఆహ్వానించారు. ఆ తరువాత ఒబైద్ సిద్ధిఖీ  1992లో బెంగళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌(TIFR లో నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ వ్యవస్థాపక డైరెక్టర్ అయ్యారు. ఒబైద్ సిద్ధిఖీ  డ్రోసోఫిలా యొక్క జన్యుశాస్త్రం మరియు న్యూరోబయాలజీపై పరిశోధన జరిపారు. 

భారతదేశపు గొప్ప పరమాణు జీవశాస్త్రవేత్త అయిన  ఒబైద్ సిద్ధిఖీ పద్మభూషణ్ (1984), పద్మవిభూషణ్ (2006), BC రాయ్ అవార్డు మరియు ఫిరోడియా అవార్డుతో సహా పలు అవార్డులతో సత్కరించబడ్డారు. ఒబైద్ సిద్ధిఖీ భారతదేశం మరియు విదేశాలలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో - యేల్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మొదలగువాటిలో భోధించారు. అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో ప్రొఫెసర్ ఒబైద్ సిద్ధిఖీని సత్కరించారు. 

డాక్టర్ ఒబైద్ సిద్ధిఖీకి నలుగురు పిల్లలు ఉన్నారు, ఇందులో ఇద్దరు కుమార్తెలు యుమ్నా మరియు దిబా, ఇద్దరు కుమారులు ఇమ్రాన్ సిద్ధిఖీ మరియు కలీమ్ సిద్ధిఖీ. ఇందులో ఇమ్రాన్ వృక్షశాస్త్ర శాస్త్రవేత్త. 

81 సంవత్సరాల వయస్సులో, ప్రొఫెసర్ ఒబైద్ సిద్ధిఖీ బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 26 జూలై 2013న మరణించారు. జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఒబైద్ సిద్ధిఖీ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలియజేసారు. 

No comments:

Post a Comment