26 October 2021

రహ్మత్ అలీ షా: జంగ్-ఎ-ఆజాదీకి చెందిన అజ్ఞాత విప్లవకారుడు रहमत अली शाह : जंग ए आज़ादी का एक गुमनाम क्रांतिकार

 

భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్యమైన పాత్ర పోషించిన గొప్ప విప్లవకారుడు అమరవీరుడు, రహమత్ అలీ షా 1886 లో బర్నాలా-సంగ్రూర్ పంజాబ్‌లోని వజీకే అనే గ్రామంలో జన్మించారు.

రహమత్ అలీ షా గద్దర్ పార్టీకి రహస్యంగా పనిచేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1857లో విప్లవ సైనికులు చేసిన విధంగా భారతదేశమంతా తిరుగుబాటు సృష్టించడం మరియు తిరుగుబాటు విజయవంతం కావడం గద్దర్ పార్టీ ఉద్దేశ్యం. ఇందుకు గాను  వారు మొదట ఫ్రాన్స్‌ ను తమ స్థావరంగా చేసుకున్నారు, తరువాత భారతదేశంలో తిరుగుబాటు సృష్టించారు.ఫిలిప్పీన్స్ మీదుగా భారతదేశానికి చేరుకున్నారు.

 

ఫిలిప్పీన్స్‌ లో, రహమత్ అలీ షా, హఫీజ్ అబ్దుల్లా, జగత్ సింగ్, కాన్సీ రామ్, ధియాన్ సింగ్, లాల్ సింగ్, చందన్ సింగ్, కాచరభల్గంధ సింగ్ వంటి విప్లవకారులతో సమావేశమయ్యారు

రహమత్ అలీ షా, అనేక మంది విప్లవకారులతో కలిసి నాగసాకి నుండి మనీలా మీదుగా హాంకాంగ్ చేరుకున్నారు, ఆ తర్వాత వారు భారతదేశంకు వచ్చారు. ఈ విప్లవకారులు భారతీయులే కానీ అమెరికా మరియు చైనా ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలలో నివసిస్తున్నారు. తమ దేశమైన హిందుస్థాన్‌ని విడిపించడం కోసం భారతదేశానికి తిరిగి వచ్చారు

భారతదేశానికి చేరుకోగానే, ఈ విప్లవకారులు మారువేషంలో ఓడరేవు నుండి రహస్యంగా తప్పించుకున్నారు. దీని తరువాత, విప్లవకారులు మియా మీర్, లాహోర్ మరియు ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్‌ల లోని బ్రిటిష్ వారికి హాని కలిగించడానికి మరియు సైనిక తిరుగుబాటును చేపట్టాలని భావించారు.

26నవంబర్, 1914, ఫిరోజ్‌పూర్ నగరం వెలుపల జలాలాబాద్ రహదారిపై గదర్ పార్టీ సమావేశం జరిగింది, అయితే అక్కడ వారు తమ తదుపరి ప్రణాళిక గురించి చర్చించలేదు

27నవంబర్, 1914, కర్తార్ సింగ్ శరభతో పాటు అందరూ లూధియానాకు రైలులో వెళ్లారు కానీ రహమత్ అలీ షా తన సహచరులతో కలిసి మోగా జిల్లాకు వెళ్లి కాచర్భల్ గంధ సింగ్, జగత్ సింగ్‌. ధియాన్ సింగ్ మరియు చందా సింగ్ తో కలిసి కాలి నడకన లూధియానా  బయలుదేరారు. వెళ్లే మార్గంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్‌ సమీపాన కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళలో  ఎక్కువగా జైల్దార్లు, లంబార్దార్లు మరియు థానేదార్లు ఉన్నారు

మహేశరి  బ్రిడ్జి దగ్గర కాలినడకన వస్తున్న ఈ గదారీలను పోలీసులు అడ్డుకుని వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు, రహమత్ అలీ షా ఎదురుతిరిగి ప్రశ్నించగా పోలీసులు చెంపదెబ్బ కొట్టారు. జగత్ సింగ్ మరియు కచరభల్ గంధ సింగ్ పోలీసులపై దాడి చేసి జైల్దార్ మరియు థానేదార్‌ని అక్కడే చంపారు మరియు  మిగిలిన పోలీసులు భయంతో పారిపోయారు.

గదర్ విప్లవకారులందరూ అడవిలో దాక్కున్నారు, కానీ అప్పటికి పోలీసులు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి నిప్పంటించారు. అక్కడ ధియాన్ సింగ్, చందా సింగ్ వీరమరణం పొందారు. మరియు మిగిలిన ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.

ఫిరోజ్‌పూర్ సెషన్స్ జడ్జి వారందరికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మరియు హత్యలకు  పాల్పడినందుకు మరణశిక్ష విధించారు. మార్చి 25, 1915 న వతన్-ఇ-అజీజ్ హిందుస్థాన్, స్వాతంత్ర్యం కొరకు 29 సంవత్సరాల వయస్సు కల ముజాహిద్-ఇ-అజాది రహమత్ అలీ షా మరియు అతని సహచరులు లాల్ సింగ్, జగత్ సింగ్ మరియు జీవన్ సింగ్‌ ను ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న మాంట్‌మేమరీ సెంట్రల్ జైలులో ఉరితీశారు. కొన్ని రోజుల తరువాత, మిగిలిన విప్లవకారులను కూడా ఉరితీశారు.

 

No comments:

Post a Comment