28 February 2025

“దారుల్ ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ

 


ఉర్దూ, అరబిక్ మరియు పర్షియన్ గ్రంథాల యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడానికి 1914లో మౌలానా షిబ్లీ నోమానిచే ‘దారుల్ ముసన్నెఫిన్’ సంస్థ స్థాపించబడింది. దారుల్ ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ, రాంపూర్‌లోని రాంపూర్ రజా లైబ్రరీ లేదా పాట్నాలోని ఖుదా బక్ష్ లైబ్రరీ లాగా విస్తారమైన పుస్తకాల సేకరణ కలిగి ఉంది.

దారుల్ ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో ఉన్న ఒక పరిశోధనా అకాడమీ. ఉర్దూలో ప్రామాణికమైన చారిత్రక సాహిత్యాన్ని సేకరించడం  దీని లక్ష్యం, ఇది మొదట్లో దారుల్ ముసన్నెఫిన్‌గా ప్రారంభించబడింది, కానీ తరువాత దాని వ్యవస్థాపకుడు షిబ్లీ నోమాని పేరు పెట్టారు.

మౌలానా షిబ్లీ నోమాని, ఒక సున్నీ ముస్లిం పండితుడు ఫిబ్రవరి 1914లో అజంగఢ్‌లో ‘దారుల్ ముసన్నెఫిన్‌’ స్థాపించాడు; అజంగఢ్‌లో నోమాని మామిడి తోటలో ‘దారుల్ ముసన్నెఫిన్‌’ స్థాపించబడింది. ఇది మౌలానా హమీదుద్దీన్ ఫరాహీ మార్గదర్శకత్వంలో 21 నవంబర్ 1914న పని చేయడం ప్రారంభించింది. దారుల్ ముసన్నెఫిన్‌ ఇతర వ్యవస్థాపకులు మౌలానా సయ్యద్ సులైమాన్ నద్వీ, మౌలానా అబ్దుస్ సలామ్ నద్వీ మరియు మౌలానా మసూద్ అలీ నద్వీ. మౌలానా షిబ్లీ జూలై 1916లో మారిఫ్ అనే మాసపత్రిక కూడా స్థాపించినారు.  

1914లో షిబ్లీ అజంగఢ్‌ లో స్థాపించిన దారుల్ ముసన్నెఫిన్‌ అకాడమీ ఓరియంటల్, ఇస్లామిక్ మరియు మధ్యయుగ భారతీయ అధ్యయనాలకు గర్వకారణమైన ప్రముఖ సంస్థ. దారుల్ ముసన్నెఫిన్‌ అకాడమీ  తొమ్మిది ఎకరాల విస్తీర్ణం లో ఉన్నది.  దారుల్ ముసన్నెఫిన్‌ అకాడమీ  1.5 లక్షలకు పైగా పుస్తకాలు మరియు సుమారు 700 అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లతో కూడిన భారీ లైబ్రరీని కలిగి ఉన్న అందమైన తెల్లని భవనం. దారుల్ ముసన్నెఫిన్‌ అకాడమీ లో  కార్యాలయం, సిబ్బంది నివాసాలు, మసీదు మరియు సమావేశ మందిరం వేరుగా ఉన్నాయి.

మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మరియు అనేకమంది ఇతర భారతీయ మరియు విదేశీ ప్రముఖులు షిబ్లీ అకాడమీ లైబ్రరీ దర్శించారు. షిబ్లీ అకాడమీ రామాయణం మరియు మహాభారతం యొక్క పర్షియన్ అనువాదాలతో సహా అరుదైన పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్‌లను కలిగి ఉంది.  మొఘల్ యువరాజు దారా షికో ద్వారా ఉపనిషత్తుల పర్షియన్ అనువాదం ‘సిర్-ఎ-అక్బర్’, కలిగి ఉంది. ఈ అరుదైన పుస్తకాలు బంగారు అంచుతో అలంకరించబడిన శీర్షికలు మరియు పేజీలు కలిగి  ఇప్పటికీ వాటి మెరుపును నిలుపుకున్నాయి.

దారా సోదరి జహనారా రచించిన సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీపై ‘మోనిసుల్ అర్వా’ అనే పుస్తకం షిబ్లీ అకాడమీ లైబ్రరీ కలిగి  ఉంది. అత్యంత విలువైన ‘మోనిసుల్ అర్వా’ పారిస్‌లోని అరుదైన మాన్యుస్క్రిప్ట్‌ల అంతర్జాతీయ ప్రదర్శనకు వెళ్లింది".

షిబ్లీ అకాడమీ లైబ్రరీ లో మహాత్మా గాంధీ, మదన్ మోహన్ మాలవ్య మరియు మౌలానా ఆజాద్‌లతో సహా అనేక మంది ప్రసిద్ధ సందర్శకుల సాక్ష్యాల testimonies నమోదు  విభాగం ఉంది. మోతీలాల్ నెహ్రూ మరియు జవహర్‌లాల్ నెహ్రూ, అజంగఢ్ సందర్శనల సమయంలో అనేక సార్లు షిబ్లీ అకాడమీ లో బస చేశారు.

షిబ్లీ అకాడమీ లైబ్రరీ మరొక ప్రసిద్ధ సందర్శకురాలు స్వాతంత్ర్య సమరయోధులు ముహమ్మద్ అలీ జౌహర్ మరియు షౌకత్ అలీల తల్లి, బి అమ్మ,  ముహమ్మద్ అలీ జౌహర్ మరియు షౌకత్ అలీ, అలీ సోదరులుగా ప్రసిద్ధి చెందిన ఖిలాఫత్ ఉద్యమ నాయకులు.

 “దారుల్ ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ” అరబిక్, పర్షియన్ మరియు ఉర్దూ నుండి ఇతర భారతీయ భాషలు మరియు ఆంగ్లంలోకి టైటిళ్ల అనువాదం మరియు డిజిటలైజేషన్‌ ప్రక్రియను ను వేగవంతం చేస్తుంది.

దారుల్ ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ” యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఇస్లాం యొక్క శాస్త్రీయ, ప్రామాణికమైన చరిత్ర మరియు హేతుబద్ధమైన వివరణలను రక్షించడం మరియు ప్రచారం చేయడం. ఇది హిందూ-ముస్లిం సామరస్యాన్ని, లేదా గంగా-జమునీ తెహజీబ్ ను సమర్థిస్తుంది

స్వాతంత్ర్యానికి ముందు, “దారుల్ ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ” హైదరాబాద్ నిజాం, భోపాల్ నవాబ్ మరియు ఇతరుల నుండి గ్రాంట్లు పొందింది.

 

రమదాన్ అంటే ఏమిటి? ముస్లింలు ఇస్లామిక్ పవిత్ర మాసం అయిన రమదాన్ ఎలా ఆచరిస్తారు What is Ramadan? How Muslims Observe the Islamic Holy Month

 

 

కైరో

ఇస్లామిక్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు రోజువారీ ఉపవాసం ఉండే ఆచారంలో ఐక్యమవుతారు. ముస్లింలకు, ఇది ఆరాధన, మతపరమైన ప్రతిబింబం, దాతృత్వం మరియు మంచి పనుల సమయం. సామాజికంగా, తరచుగా కుటుంబాలు మరియు స్నేహితులను పండుగ సమావేశాలలో భోజనాల చుట్టూ కలిసి ఉపవాసం విరమించుకోవడ౦ జరుగుతుంది.

రంజాన్ తర్వాత ఈద్ అల్-ఫితర్ అనే ఇస్లామిక్ సెలవుదినం వస్తుంది.రంజాన్ యొక్క మతపరమైన ఆచారాలు మరియు ఆధ్యాత్మిక సారాంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న ముస్లిం సమాజాలను ఏకం చేస్తుంది. రంజాన్ నెల ప్రార్థనల కేంద్రబిందువుగా మారును.పవిత్ర మాసం రంజాన్ నెలలో చాలా మంది అవసరం ఉన్నవారికి దానం చేయడం లేదా ఆర్ధికంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది..

రంజాన్ ఎప్పుడు?

రంజాన్ ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్‌లోని  తొమ్మిదవ నెల; రంజాన్ నెల ప్రారంభం సాంప్రదాయకంగా నెలవంకను చూడటంపై ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం, రంజాన్ మొదటి రోజు మార్చి 1న ఉంటుంది అని భావిస్తున్నారు.

ముస్లింలు ఎందుకు మరియు ఎలా ఉపవాసం ఉంటారు?

ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు- ఉపవాసం, విశ్వాసం, ప్రార్థన, దానధర్మాలు మరియు హజ్  తీర్థయాత్ర.

ముస్లిములు దేవుని పట్ల భక్తిని మరియు దేవునికి సమర్పణను పొందడానికి ఆరాధనగా ఉపవాసం భావిస్తారు. రంజాన్ లో విశ్వాసులు స్వీయ నిగ్రహాన్ని పాటించడం, దేవునికి దగ్గర అవ్వడం, కృతజ్ఞతను పెంపొందించుకోవడం మరియు పేదలు మరియు ఆకలితో ఉన్న ప్రజలపట్ల  సానుభూతి చూపడం చేస్తారు.

రంజాన్‌లో రోజువారీ ఉపవాసంలో తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు అన్ని రకాల ఆహారం మరియు పానీయాలకు దూరంగా ఉండటం జరుగుతుంది.– (ఒక గుక్క నీరు కూడా తాగకూడదు) - అరబిక్‌లో "ఇఫ్తార్" అని పిలువబడే భోజనంతో  ఉపవాసం ముగిస్తారు.. ఉపవాసం ఉన్నవారు గాసిప్ చేయడం వంటి చెడు పనులకు కూడా దూరంగా ఉండాలని మరియు మంచి పనులను చేయాలని భావిస్తారు..

ముస్లింలు సాధారణంగా సామూహిక ప్రార్థనల కోసం మసీదులకు  వెళతారు మరియు మతపరమైన ధ్యానం మరియు ముస్లిం పవిత్ర గ్రంథం ఖురాన్ పఠనం కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు.

దానధర్మాలు రంజాన్ యొక్క ముఖ్య లక్షణం. దానం చేసే ఇతర మార్గాలలో, చాలామంది అవసరమైన వారికి ఇఫ్తార్ అందించడానికి, రంజాన్ బాక్స్ లను పంపిణీ చేయడానికి, ఖర్జూరం మరియు భోజనాలను అందజేయడానికి లేదా ఉచిత సామూహిక భోజనాలను నిర్వహించడానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.

ముస్లింలు రోజువారీ ఉపవాసానికి ముందు తమ శరీరాలను హైడ్రేట్ చేయడానికి మరియు పోషించుకోవడానికి "సుహూర్" అని పిలువబడే తెల్లవారుజాము భోజనం చేస్తారు.

ఉపవాసం నుండి మినహాయింపులు ఉన్నాయా?

ఉన్నాయి.. అనారోగ్యం లేదా ప్రయాణం కారణంగా ఉపవాసం ఉండలేని వారికి ఉపవాసం నుండి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. తాత్కాలికంగా అనారోగ్యంతో ఉండటం లేదా ప్రయాణం చేయడం వల్ల ఉపవాసం ఉండలేని వారు తరువాత ఉపవాసం తప్పిపోయిన రోజులను భర్తీ చేసుకోవాలి.

రంజాన్‌తో సంబంధం ఉన్న కొన్ని సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు ఏమిటి?

ముస్లింలు తమ ఇళ్లను అలంకరిస్తారు, రంజాన్ నేపథ్య టేబుల్‌వేర్ మరియు సెంటర్‌పీస్‌లను ఉంచుతారు లేదా మార్కెట్‌లు మరియు రంజాన్ బజార్‌లకు వెళతారు. 

అరబ్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన ఈజిప్టులో, రంజాన్ సాధారణంగా పండుగ సమయం.వివిధ ఆకారాలు మరియు పరిమాణాలలో రంగురంగుల లాంతర్లు పిల్లల చేతుల నుండి వేలాడుతూ ఉంటాయి.  ఇళ్లను లేదా భవనాలు మరియు దుకాణాల ప్రవేశ ద్వారాలను అలంకరిస్తారు. నెలను స్వాగతించడానికి రంజాన్ పాటలను ప్లే చేస్తారు..

ఈజిప్టులో రంజాన్ పండుగ లో సాంప్రదాయకంగా తెల్లవారుజామున డ్రమ్స్ మ్రోగించే "మెసహారతి" పొరుగు ప్రాంతాలలో తిరుగుతూ, విశ్వాసులను సుహూర్ భోజనం కోసం మేల్కొలుపుతాడు.

ఇండోనేషియాలో, కొన్ని రంజాన్ ఆచారాలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి, ఇది స్థానిక సంస్కృతుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇండోనేషియాలోని సాంప్రదాయిక ఆషే ప్రావిన్స్‌లోని ప్రజలు మెగాంగ్ ఉత్సవాల సమయంలో జంతువులను వధిస్తారు. మాంసం వండుతారు మరియు కుటుంబం, స్నేహితులు, పేదలు మరియు అనాథలతో సామూహిక విందులో పంచుకుంటారు.

జకార్తా రాజధాని వెలుపల ఉన్న టాంగెరాంగ్ నగరంలో వందలాది మంది నివాసితులు బియ్యం గడ్డి షాంపూతో తమ జుట్టును కడుక్కోవడానికి మరియు ఆధ్యాత్మిక ప్రక్షాళనతో ఉపవాస మాసాన్ని స్వాగతించడానికి సిసాడేన్ నదికి తరలివస్తారు.

సుమత్రా ద్వీపం అంతటా, సాయంత్రం ప్రార్థనల తర్వాత, చాలా మంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు వీధుల్లో ఊరేగింపుగా టార్చెస్ పట్టుకుని, ఇస్లామిక్ పాటలు పాడుతూ ఉంటారు.

200 మిలియన్లకు పైగా ముస్లిం మైనారిటీ జనాభా ఉన్న భారతదేశంలో, అనేక వీధుల్లో వరుసలో ఉన్న స్టాల్స్‌లో ఖర్జూరాలు, స్వీట్లు మరియు తాజాగా వండిన ఆహారం వంటివి అమ్ముతారు. రాత్రి సమయంలో, ముస్లింలు ప్రార్థనలకు హాజరు కావడానికి మసీదులకు వెళ్లడంతో  పాతఢిల్లీ పరిసరాలు ఉత్సాహంగా మారుతాయి.

కొంతమంది భారతీయ ముస్లింలు లైట్లు మరియు రంగురంగుల పూలతో అలంకరించబడిన సూఫీ మందిరాలను కూడా సందర్శిస్తారు.

ముస్లింలు మైనారిటీగా ఉన్న యునైటెడ్ స్టేట్స్‌లో, వీలైనప్పుడల్లా ఇఫ్తార్ భోజనం మరియు ప్రార్థనల కోసం మసీదులు మరియు ఇస్లామిక్ కేంద్రాలలో సమావేశమవుతారు కొంతమంది ముస్లింలు మతాంతర ఇఫ్తార్ భోజనాలను కూడా నిర్వహిస్తారు లేదా హాజరవుతారు.

కొంతమంది పెద్ద US రిటైలర్లు రంజాన్ రంజాన్ నేపథ్య అలంకరణ సామగ్రి వంటి వాటిని విక్రయిస్తున్నారు.


ఆధారం: టైం మ్యాగజైన్

 

27 February 2025

20వ శతాబ్దపు 34 ప్రముఖ ముస్లిం సంస్కర్తలు 34 Prominent Muslim Reformers of The 20th Century

 



ఇస్లామిక్ ప్రపంచంలో అనేక శతాబ్దాల మేధో క్షీణత మరియు దీర్ఘకాలిక స్తబ్దత తర్వాత, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు మహమ్మద్ అబ్దుహ్ వంటి అనేక మంది 19వ శతాబ్దపు పండితులు ముస్లింలకు వారి గొప్ప మేధో వారసత్వాన్ని మరియు వారి ప్రస్తుత వెనుకబాటుతనం యొక్క వాస్తవికతను గుర్తు చేయడానికి చొరవ తీసుకున్నారు.

 ముస్లింలలో ఏర్పడిన మేధో క్షీణత సైన్స్ మరియు ఆధునిక ప్రపంచం నుండి వారి నిర్లిప్తత నుండి ఉద్భవించిందని వారు నొక్కి చెప్పారు. ముస్లిం సమాజ సంస్కర్తలు భారతదేశం మరియు ఇస్లామిక్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఆధునిక ముస్లిం విద్యకు పునాది వేశారు.

ఇస్లామిక్ సూత్రాలు ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులతో సహా ఆధునిక విలువలకు అనుకూలంగా ఉన్నాయని ముస్లిం సమాజాన్ని ఒప్పించడానికి ముస్లిం సమాజ సంస్కర్తలు, పండితులు అవిశ్రాంతంగా కృషి చేశారు. ముస్లిం సమాజ సంస్కర్తల ప్రయత్నాలు ముస్లిం ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల స్థాపనకు దారితీశాయి, ఇవి ప్రగతిశీల ఆలోచన మరియు అభ్యాసానికి కేంద్రాలుగా మారాయి

ఇస్లామిక్ ప్రపంచంలో సైన్స్ పురోగతికి, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి, హేతుబద్ధమైన ఆలోచనను, మేధో విచారణను ప్రోత్సహించడానికి  ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దోహదపడిన 34 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా ఇక్కడ ఉంది.

 

20వ శతాబ్దపు ప్రముఖ ముస్లిం సంఘ సంస్కర్తలు

 

1. అబ్దుల్ మజీద్ దర్యాబాది (1892–1977, భారతదేశం) -- ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు, పాత్రికేయుడు మరియు ఖురాన్ వ్యాఖ్యాత అయిన అబ్దుల్ మజీద్ దర్యాబాది సాంప్రదాయ ఇస్లామిక్ విద్వత్తు మరియు ఆధునిక మేధో విచారణ యొక్క అరుదైన కలయిక..

2. అబ్దుల్ మాలిక్ కరీం అమ్రుల్లా (హంకా) (1908–1981, ఇండోనేషియా) -- అబ్దుల్ మాలిక్ కరీం అమ్రుల్లా (హంకా) హేతుబద్ధమైన ఇస్లామిక్ ఆలోచనను సమర్థించారు మరియు అంధ సాంప్రదాయవాదాన్ని వ్యతిరేకించారు.

3. అబుల్ హసన్ అలీ హసాని నద్వి, మౌలానా (1914–1999, భారతదేశం) -- అబుల్ హసన్ అలీ హసాని నద్వి, మౌలానా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇస్లామిక్ పండితుడు, గొప్ప రచయిత మరియు లక్నోలోని నద్వతుల్ ఉలేమా ఛాన్సలర్‌గా పనిచేశారు. 16వ శతాబ్దం తర్వాత, ముస్లింలు శాస్త్రీయ విచారణపై ఆసక్తిని కోల్పోయారని మరియు మెటాఫిజికల్ శాస్త్రాలపై ఎక్కువ దృష్టి సారించారని, ఇది ముస్లిముల మేధో పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మౌలానా నద్వి గమనించారు.

4. అబుల్ కలాం ఆజాద్ (1888–1958, భారతదేశం) -- భారతదేశపు మొట్టమొదటి విద్యా మంత్రి,అయిన అబుల్ కలాం ఆజాద్ ఉన్నత శాస్త్రీయ అధ్యయనం కోసం సంస్థలు మరియు కళాశాలలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.

5. అహ్మద్ దహ్లాన్ (1868–1923, ఇండోనేషియా) -- అహ్మద్ దహ్లాన్ ఇండోనేషియాలో ముహమ్మదియా ఉద్యమ స్థాపకుడు. అహ్మద్ దహ్లాన్ ఆధునిక విద్య మరియు ఖురాన్ మరియు సున్నత్‌లకు  ముస్లింసమాజం తిరిగి రావడాన్నిగురించి  నొక్కి చెప్పారు. అహ్మద్ దహ్లాన్ ప్రారంభించిన ఉద్యమం ఇండోనేషియాలో వందలాది పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఆసుపత్రుల స్థాపనకు దారితీసింది.

6. అలెగ్జాండర్ రస్సెల్ వెబ్ (1846–1916, USA) -- ఇస్లాం మతంలోకి మారిన మొదటి ప్రముఖ అమెరికన్లలో ఒకరైన అలెగ్జాండర్ రస్సెల్ వెబ్ తన రచనలు, ఉపన్యాసాలు మరియు మతాంతర సంభాషణల ద్వారా పశ్చిమ దేశాలలో ఇస్లాంను ప్రోత్సహించారు.

7. అలీ షరియాతి మజినాని (1933–1977, ఇరాన్) -- ఇస్లామిక్ ఆలోచనలను సోషలిస్ట్ మరియు విప్లవాత్మక ఆదర్శాలతో మిళితం చేసి, రాజకీయ మరియు మత సంస్కరణ ఉద్యమాలకు అలీ షరియాతి మజినాని ప్రేరణనిచ్చింది.

8. బషీర్ హుస్సేన్ జైదీ, కల్నల్ (1898–1982, భారతదేశం) -- అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ అయిన  బషీర్ హుస్సేన్ జైదీ అలీఘర్ విశ్వవిద్యాలయం యొక్క విద్యా కార్యక్రమాలు మరియు పరిశోధన కార్యక్రమాల విస్తరణలో, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాల అభివృద్దిలో కీలక పాత్ర పోషించారు.

9. బుర్హానుద్దీన్ అల్-హెల్మీ (1911–1969, మలేషియా) -- మలేషియా స్వాతంత్ర్యం మరియు ఆధునిక ఇస్లామిక్ ఆధారిత పాలనా వ్యవస్థ స్థాపన కోసం బుర్హానుద్దీన్ అల్-హెల్మీకృషి చేసారు..

10. ఫజ్లుర్ రెహమాన్ మాలిక్ (1919–1988, పాకిస్తాన్) -- ఫజ్లుర్ రెహమాన్ మాలిక్ స్వతంత్ర తార్కికం (ఇజ్తిహాద్) పునరుజ్జీవనాన్ని నొక్కి చెప్పిన ఉదారవాద సంస్కర్త. ఖురాన్ ఆదేశాలను నెరవేర్చినందున ముస్లిం ప్రపంచంలో సైన్స్ ఒకప్పుడు అభివృద్ధి చెందిందని ఫజ్లుర్ రెహమాన్ మాలిక్ అన్నారు..

11. గమల్ అబ్దేల్ నాసర్ (1918–1970, ఈజిప్ట్) -- టిటో మరియు నెహ్రూలతో పాటు అలీన ఉద్యమంలో నాసర్ ప్రముఖ  నాయకుడు. నాసర్ అంతర్జాతీయ శాంతి కోసం పనిచేశాడు మరియు ఈజిప్టులో ఆధునీకరణను ప్రోత్సహించాడు.

12. హకీమ్ అజ్మల్ ఖాన్ (1868–1927, భారతదేశం) -- బహుముఖ వ్యక్తిత్వంకలిగిన హకీమ్ అజ్మల్ ఖాన్ - వైద్యుడు, పండితుడు మరియు జాతీయవాద నాయకుడు. మూలికా వైద్యం అభివృద్ధిలో హకీమ్ అజ్మల్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు మరియు ఢిల్లీలో ఆయుర్వేద మరియు యునాని టిబ్బియా కళాశాలను స్థాపించాడు. హకీమ్ అజ్మల్ ఖాన్ జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకులలో ఒకడు.

13. హసన్ అల్-బన్నా (1906–1949, ఈజిప్ట్) -- ఇస్లామిక్ సూత్రాలలో మిళితమైన ఆధునిక పాలనను స్థాపించడానికి హసన్ అల్-బన్నా ప్రయత్నించారు  మరియు ముస్లిం బ్రదర్‌హుడ్‌ను స్థాపించారు.

14. హసీమ్ అస్యారి (1871–1947, ఇండోనేషియా) -- ఇండోనేషియాలోని అతిపెద్ద ఇస్లామిక్ సంస్థ అయిన నహ్ద్లాతుల్ ఉలామా వ్యవస్థాపకుడు అయిన  హసీమ్ అస్యారి సాంప్రదాయవాదం మరియు ఆధునికవాదం మధ్య సమతుల్యత కోసం కృషి చేసారు.

15. హుస్సేన్ అహ్మద్ మదానీ (1879–1957, భారతదేశం) -- భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో హుస్సేన్ అహ్మద్ మదానీ ముఖ్యమైన పాత్ర పోషించారు మరియు హిందూ-ముస్లిం ఐక్యతకు బలమైన సమర్ధకుడు.

16. ఇస్మాయిల్ అల్-ఫరూకి (1921–1986, పాలస్తీనా/USA) -- ఇస్లామిక్ అధ్యయనాలు మరియు మతాంతర సంభాషణలలో కృషి చేసిన  ఇస్మాయిల్ అల్-ఫరూకి గొప్ప పండితుడు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇస్లామిక్ థాట్ (IIIT)ను ఇస్మాయిల్ అల్-ఫరూకి స్థాపించారు.

17. కెమాల్ అటాతుర్క్ (1881–1938, టర్కీ) -- టర్కీ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు మరియు మొదటి అధ్యక్షుడు అయిన కెమాల్ అటాతుర్క్. టర్కీ విద్యా వ్యవస్థను ఆధునీకరించారు, యూరోపియన్ జీవన విధానాలను ప్రోత్సహించారు, టర్కీ లో లాటిన్ వర్ణమాలను ప్రవేశపెట్టారు మరియు మహిళా విముక్తి emancipation ని ప్రోత్సహించారు.

18. మాల్కం X (ఎల్-హజ్ మాలిక్ ఎల్-షబాజ్) (1925–1965, USA) -- మాల్కం X ఇస్లాంను స్వీకరించారు మరియు ఇస్లామిక్ చట్రంలో జాతి సమానత్వాన్ని ప్రోత్సహించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో ఐక్యత కోసం మాల్కం Xకృషి చేసారు..

19. మాలెక్ బెన్నాబి (1905–1973, అల్జీరియా) -- ఇస్లామిక్ నాగరికత క్షీణతకు మేధోపరమైన సృజనాత్మకత మరియు కొత్త ఆలోచనలు లేకపోవడం కారణమని మాలెక్ బెన్నాబిఅన్నారు.  వ్యక్తులకు సాధికారత కల్పించే వాతావరణం యొక్క అవసరాన్ని మాలెక్ బెన్నాబి నొక్కి చెప్పారు.

20. మెహ్మెట్ అకిఫ్ ఎర్సోయ్ (1873–1936, టర్కీ) -- ఇస్లామిక్ ఆధునికవాది, కవి మరియు టర్కీ జాతీయ గీత రచయిత. మెహ్మెట్ విద్య మరియు నైతిక సంస్కరణల ద్వారా ఇస్లామిక్ పునరుజ్జీవనాన్ని సమర్థించారు.

21. మొహమ్మద్ నట్సీర్ (1908–1993, ఇండోనేషియా) -- ఇస్లామిక్ ఆలోచనాపరుడు, రాజకీయ నాయకుడు అయిన మొహమ్మద్ నట్సీర్. ప్రజాస్వామ్యం, విద్య మరియు ఇస్లామిక్-ఆధారిత బహుత్వ సమాజాన్ని సమర్ధించారు.

22. ముహమ్మద్ అలీ, మౌలానా (1878–1931, భారతదేశం) -- ఖిలాఫత్ ఉద్యమానికి ప్రముఖ నాయకుడు మరియు మహాత్మా గాంధీకి సన్నిహితుడు అయిన మౌలానా ముహమ్మద్ అలీ  హిందూ-ముస్లిం ఐక్యత మరియు దేశ స్వాతంత్ర్య౦ కోసం బలంగాకృషి చేసారు..

23. మొహమ్మద్ హుస్సేన్ హైకల్ (1888–1956, ఈజిప్ట్) -- ఇస్లామిక్ నాగరికత చారిత్రాత్మకంగా సైన్స్ మరియు హేతువాదంపై నిర్మించబడిందని మొహమ్మద్ హుస్సేన్ హైకల్ అన్నారు.. హైకల్ ది లైఫ్ ఆఫ్ ముహమ్మద్ (హయత్ ముహమ్మద్) రచయిత.

24. ముహమ్మద్ అసద్ (1900–1992, ఆస్ట్రియా/పాకిస్తాన్) -- ముహమ్మద్ అసద్ ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి మరియు ది రోడ్ టు మక్కా రచయిత. ఆధునిక పాలనలో ఇస్లామిక్ విలువల పునరుజ్జీవనం కోసం ముహమ్మద్ అసద్  కృషి  చేసారు..

25. ముహమ్మద్ ఇక్బాల్ (1877–1938, భారతదేశం) -- ఇజ్తిహాద్ మరియు విద్య ఆధారంగా సంస్కరించబడిన ముస్లిం గుర్తింపును ఊహించిన తత్వవేత్త మరియు కవి. ఉమ్మా సవాళ్లకు విద్య కీలక పరిష్కారం అని ముహమ్మద్ ఇక్బాల్ అన్నారు.

26. ముహమ్మద్ రషీద్ రిడా (1869–1935, ఈజిప్ట్) --ముహమ్మద్ రషీద్ రిడా ఆధునికీకరణ ప్రయత్నాలకు నాయకత్వం వహించారు  మరియు విజ్ఞాన శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యతను సమర్థించారు.

27. ముసా బిగివ్ (1870–1949, టాటర్‌స్తాన్) -- "ఇస్లామిక్  లూథర్" గా పిలబడే ముసా బిగివ్ విద్యా మరియు మతపరమైన సంస్కరణల కోసం ప్రారంబించిన జాదిద్ ఉద్యమంలో కీలక వ్యక్తి.

28. సయీద్ నూర్సీ (1877–1960, టర్కీ) -- సయీద్ నూర్సీ శాంతియుత ఇస్లామిక్ పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించారు, ఆధునిక శాస్త్రంతో ఇస్లాం యొక్క అనుకూలతను నొక్కి చెప్పారు. 

29. షేక్ మహమూద్ షల్తుట్ (1893–1963, ఈజిప్ట్) -- అబ్దుహ్ ఆలోచనా విధానంలో ప్రముఖ పండితుడు అయిన  షేక్ మహమూద్ షల్తుట్ అల్-అజార్ యొక్క గ్రాండ్ ఇమామ్.  

30. షిబ్లి నోమాని (1857–1914, భారతదేశం) -- షిబ్లి నోమాని ఆధునిక దృక్పథం కలిగిన ఇస్లామిక్ పండితుడు. అజంగఢ్‌లో షిబ్లి నేషనల్ కాలేజీ మరియు దారుల్ ముస్సానిఫిన్ (రచయితల సభ) షిబ్లి నోమాని వ్యవస్థాపకుడు.

31. సయ్యద్ అమీర్ అలీ (1849–1928, భారతదేశం) -- అమీర్ అలీ ఇస్లామిక్ చరిత్ర మరియు ఆధునిక అభివృద్ధిపై విస్తృతంగా రాసిన న్యాయనిపుణుడు మరియు చరిత్రకారుడు.

32. తహా హుస్సేన్ (1889–1973, ఈజిప్ట్) -- ఈజిప్టులోని అత్యంత ప్రభావవంతమైన మేధావులలో తహా హుస్సేన్ ఒకరు. ఈజిప్టు సమాజాన్ని ఆధునీకరించడానికి కృషి చేశారు మరియు ఇస్లామిక్ సంప్రదాయాన్ని పాశ్చాత్య ఆలోచనలతో సమన్వయం చేయడానికి ప్రయత్నించారు. 

33. జాకీర్ హుస్సేన్, డాక్టర్ (1897–1969, భారతదేశం) -- రాజనీతిజ్ఞుడు మరియు విద్యావేత్త అయిన జాకీర్ హుస్సేన్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ మరియు భారతదేశపు మొదటి ముస్లిం అధ్యక్షుడు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆధునిక విద్యకు బలమైన సమర్ధకుడు.

34. జియా గోకల్ప్ (1876–1924, టర్కీ) -- ఆధునిక జాతీయవాద విలువలతో పాటు  ఇస్లామిక్ విలువలను కూడా జియా గోకల్ప్ ప్రోత్సహించారు.