పాట్నా, బీహార్:
మూడు దశాబ్దాలుగా, డాక్టర్ ఎజాజ్ అలీ పాట్నాకు చెందిన ఒక వైద్యుడు సంప్రదింపుల కోసం కేవలం రూ.10 వసూలు చేస్తూ, పేదలు మరియు నిరుపేదలకు ఆశాకిరణంగా నిలిచాడు మరియు రోగులలో "మెస్సీయ" బిరుదును సంపాదించాడు.
వైద్యం తో పాటు రాజకీయాలలో ఆసక్తి ఉన్న డాక్టర్ ఎజాజ్ అలీ మార్చి 20, 2008 నుండి జూలై 7, 2010 వరకు, బీహార్ నుండి రాజ్యసభk కు జనతాదళ్ (యునైటెడ్)కు ప్రాతినిధ్యం వహించారు. డాక్టర్ ఎజాజ్ అలీ ఆల్-ఇండియా బ్యాక్వర్డ్ ముస్లిం మోర్చా జాతీయ కన్వీనర్గా కూడా పనిచేశారు.
డాక్టర్ ఎజాజ్ అలీ పాట్నా లో మెడికల్ ప్రాక్టిస్ చేస్తూ రోగులనుండి కేవలం ఫీజుగా రూ.10 వసులు చేస్తారు.. పాట్న లోని డాక్టర్ ఎజాజ్ అలీ క్లినిక్, బీహార్ అంతటా రోగులను ఆకర్షిస్తుంది.
డాక్టర్ ఎజాజ్ అలీ క్లినిక్లో ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ మంది రోగులకు కన్సల్టేషన్ మరియు శస్త్రచికిత్సలు జరుగుతాయి. కన్సల్టేషన్ల కోసం కనీస రుసుము వసూలు చేయడంతో పాటు, డాక్టర్ అలీ సరసమైన ఖర్చుతో శస్త్రచికిత్సలు చేస్తారు. డాక్టర్ ఎజాజ్ అలీ తన రోగులు ఫీజ్ ను వాయిదాలలో చెల్లించడానికి అనుమతిస్తారు
డాక్టర్ ఎజాజ్ అలీ దివంగత భార్య కూడా
ఒక వైద్యురాలు. డాక్టర్ ఎజాజ్ అలీ కుమార్తె డాక్టర్ సురయ్య అంజుమ్ ఒక గైనకాలజిస్ట్. డాక్టర్ ఎజాజ్ అలీ కి కీర్తి మరియు
గుర్తింపు ఉన్నప్పటికీ, డాక్టర్
ఎజాజ్ అలీ తన పని
పట్ల వినయంగా మరియు అంకితభావంతో ఉన్నారు..
No comments:
Post a Comment