భారతదేశం లోని కోల్కతా ట్రామ్ ఆసియాలో అత్యంత పురాతనమైన పనిచేస్తున్న ట్రామ్
వ్యవస్థ. కోల్కతా ట్రామ్ వ్యవస్థకు 152 సంవత్సరాల నిండినవి. ట్రామ్ భారతదేశంలో అత్యంత చౌకైన
రవాణా వ్యవస్థ.
భారతదేశంలో ట్రామ్ల ప్రయాణం 1873లో కోల్కతాలో (అప్పటి కలకత్తా) ప్రారంభమైంది, తరువాత ముంబై, చెన్నై మరియు ఢిల్లీ వంటి నగరాలలో ట్రామ్
రవాణా వ్యవస్థ కొనసాగింది.. కాని 1964లో ముంబై, 1953లో చెన్నై, 1963లో ఢిల్లీ లో ట్రామ్రవాణా వ్యవస్థ రద్దు
అయింది. కోల్కతా మాత్రం అలాగే
కొనసాగింది.
కాన్పూర్ మరియు నాసిక్లలో ఒకప్పుడు ట్రామ్లు ఉన్నాయి, కానీ 20వ శతాబ్దం మధ్య నాటికి అవి రద్దు అయినాయి. ఇటీవల హైదరాబాద్ లో కూడా 2017 మరియు 2022లో ట్రామ్వ్యవస్థ సాధ్యాసాధ్యాలపై నివేదికలు కోరబడి చివరికి ట్రామ్ ప్రణాళికను పక్కన పెట్టడం
జరిగినది..
నేడు, కోల్కతా ట్రామ్లు కలిగిన ఏకైక భారతీయ నగరంగా
మిగిలిపోయింది. ట్రామ్లు మొదట కోల్కతాలో 1873లో గుర్రపు స్వారీ వ్యవస్థగా ప్రవేశపెట్టబడి, 1902 నాటికి విద్యుత్ శక్తితో నడిచే ట్రామ్లు గా పరిణామం
చెందాయి. దశాబ్దాలుగా, ట్రామ్ నెట్వర్క్ కోల్కతా నగరం అంతటా విస్తరించి, సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు సరసమైన రవాణాను అందిస్తోంది.
నేడు ట్రామ్లు గతానికి సంబంధించిన అవశేషాలు మాత్రమే కాదు; అవి స్థిరమైన, సమర్థవంతమైన రవాణాకు నిదర్శనం. ట్రామ్లు కేవలం రవాణా విధానం కాదు, అవి కోల్కతా ఆత్మలో అంతర్భాగం, కోల్కతా నగరం యొక్క గుర్తింపులో ట్రామ్లు తమ పాత్రను నిర్వహించినవి. ఫిబ్రవరి 24న కోల్కతాలోని ట్రామ్స్ ఆఫ్ ఇండియా తన 152వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది ఇది నిజంగా ఒక చిరస్మరణీయ మైలురాయి.
ట్రామ్ ప్రయాణం ఒక ద్యోతకం/తీపి జ్ఞాపకం.. ట్రామ్ ప్రయాణం నగరం యొక్క
శాశ్వత రద్దీకి విరుగుడు. 20వ శతాబ్దం మధ్య నాటికి, ట్రామ్లు కోల్కతాకు పర్యాయపదంగా మారాయి, ట్రామ్లు వలసరాజ్యాల యుగం వాస్తుశిల్పం మరియు కోల్కతా ప్రకృతి దృశ్యానికి
అంతర్భాగంగా మారాయి. వేగంతో కూడిన యుగంలో, ట్రామ్లు వారసత్వ రవాణా వ్యవస్థకు చిహ్నంగా మారాయి.
ట్రామ్ల ఉనికి తగ్గుతున్నప్పటికీ, కోల్కతా ట్రామ్లు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పర్యావరణవేత్తలు
భావిస్తున్నారు. . వారసత్వ పరిరక్షకులు వాటిని సజీవ చరిత్రగా, సంరక్షణకు అర్హమైన సాంస్కృతిక నిధిగా చూస్తారు. చాలా
మందికి, ట్రామ్లు కేవలం రవాణా కాదు; అవి జ్ఞాపకశక్తి మరియు గుర్తింపు, గతం మరియు వర్తమానం మధ్య వారధి.
ట్రామ్ వ్యవస్థకు కొత్త ఊపిరి పోసేందుకు
ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎయిర్ కండిషన్డ్ ట్రామ్లు ప్రవేశపెట్టబడ్డాయి మరియు
వాటిని ఆధునిక రవాణా నెట్వర్క్లలో అనుసంధానించడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రజా
ఆసక్తిని తిరిగి రేకెత్తించడానికి మొబైల్ లైబ్రరీ ట్రామ్,
మూవింగ్
ట్రామ్ రెస్టారెంట్, అద్దెకు ట్రామ్లు మొదలైన వివిధ కార్యక్రమాలు
ప్రవేశపెట్టబడినవి.
మార్చి 27
నుండి 31
వరకు జరగనున్న ట్రామ్జాత్రా కార్యక్రమం ప్రజా ప్రయోజనాలను పునరుజ్జీవింపజేయడం
మరియు క్షీణిస్తున్న ట్రామ్రవాణా విధానాన్ని సంరక్షించడానికి మరియు
ఆధునీకరించడానికి అధికారులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
No comments:
Post a Comment