14 December 2023

లండన్‌లోని రెండు మ్యూజియంలలో(బ్రిటీష్ మ్యూజియం, V&A మ్యూజియం) టిప్పు సుల్తాన్ కత్తులు మరియు ఉంగరం కలవు, Tipu Sultan’s swords and ring in two Museums in London

 


మే 4, 1799, ఈస్టిండియా కంపెనీ సైన్యంతో పోరాడుతూ భారతీయ పాలకుడు టిప్పు సుల్తాన్ చంపబడ్డాడు.టిప్పు సుల్తాన్ వ్యక్తిగత ఆస్తులు మరియు గొప్ప లైబ్రరీ లూటీ చేయబడ్డాయి. టిప్పు సుల్తాన్ వాడిన నాలుగు కత్తులు లండన్‌లోని రెండు ప్రసిద్ధ మ్యూజియంలలో శాశ్వత ప్రదర్శనలో ఉన్నాయి.

బ్రిటీష్ మ్యూజియంలోని 'దక్షిణాసియా గ్యాలరీ' భారతీయ పాలకుడు టిప్పు సుల్తాన్‌ వస్తువులు కత్తి, ఉంగరం మరియు పెర్ఫ్యూమ్ బాక్స్‌ ను ప్రదర్శిస్తుంది.

టిప్పు సుల్తాన్‌ భారతదేశంపై వలసవాద దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతూ చనిపోయాడు..బ్రిటీష్ వారు సరిరంగపట్నం నగరాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్న యుద్ధంలో టిప్పు సుల్తాన్ 1799లో చంపబడ్డాడు.

టిప్పు ఆస్తులు విజేతలచే తీసుకోబడింది మరియు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో ఉన్నాయి.

టిప్పు సుల్తాన్ చిహ్నమైన పులితో అలంకరించబడిన ఖడ్గం మైసూరు ఖజానా నుండి వచ్చింది. బంగారు ఉంగరాన్ని మైసూర్ నివాసి ఆర్థర్ హెన్రీ కోల్ యుద్ధం తర్వాత టిప్పు సుల్తాన్ వేలి నుండి తీసుకున్నాడని చెబుతారు.

V&A మ్యూజియంలో మరో రెండు కత్తులు ప్రదర్శనలో ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో టిప్పు సుల్తాన్ సిల్క్ గౌను కనిపిస్తుంది.

టిప్పు, మైసూర్‌లో పట్టు పరిశ్రమను స్థాపించడానికి చైనా నుండి పట్టు పురుగు మరియు సాంకేతికతను దిగుమతి చేసుకున్నాడు.

టిప్పు సుల్తాన్ తన యుద్ద రాకెట్‌కు ప్రసిద్ధి చెందాడు. టిప్పు సుల్తాన్ కి సముద్ర నౌకాదళం ఉందని చాలా కొద్దిమందికి తెలుసు మరియు టిప్పు సుల్తాన్ తన ఆఫ్‌షోర్ నేవీ ఫ్లీట్ కోసం అరేబియా గల్ఫ్‌లోని ఒక ద్వీపానికి యాక్సెస్ ఇవ్వమని ఒట్టోమన్ సుల్తాన్‌ను కోరాడు.

No comments:

Post a Comment