4 August 2022

కిలకరై జుమా మసీదు లేదా కిలకరై లోని ద్రావిడ మసీదు Kilakarai Juma Masjid or Dravidian Mosque in Kilakarai

  

  


కిలకరైలోని ద్రావిడ మసీదు Dravidian Mosque in Kilakarai.

చెన్నై నుండి 500 కి.మీ దూరంలో ఉన్నకిలకరై అనే  చిన్న పట్టణంలో ద్రావిడ మసీదు ఉంది

కిలకరాయ్‌ను తన నివాసంగా చేసుకున్న ఒక సంపన్న వ్యాపారి షేక్ అబ్దుల్ ఖాదిర్, మసీదును ప్రారంభించినట్లు నమ్ముతారు.

 భారతదేశ తూర్పు తీరంలో, చెన్నైకి దక్షిణాన 560 కి.మీ దూరంలో కిలకరై అని పిలువబడే ఒక చిన్న పట్టణం ప్రధానంగా ఇండియన్ మూర్స్‌ అనబడే  అరబ్, తమిళం, మలేయ్ మరియు సింహళ పూర్వీకుల కమ్యూనిటీ జనాభా ను కలిగి ఉంది, ఈ పట్టణం లో ఒక ద్రావిడ మసీదు/జుమా మసీదు  ఉంది..

కిలకరై జుమా మసీదు కిలకరై పురాతన పట్టణానికి మకుటం మరియు  దాని చరిత్రకే కాకుండా దాని విశిష్టమైన నిర్మాణ వారసత్వానికి కూడా మకుటం.

ప్రాచీన ద్రావిడ నిర్మాణ శైలిని ఉపయోగించి, నిర్మించాబడిన కిలకరై మసీదు విశ్వాసాలు మరియు సంస్కృతుల నిజమైన సామరస్యానికి అద్భుతమైన సాక్ష్యo.  రాతితో చెక్కబడిన ఈ భవనం స్థానిక కళాకారుల గొప్ప పనితనాన్ని కూడా తెలియజేస్తుంది.

ఒకప్పుడు వర్తక మరియు వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న కిలకరాయి సుదూర ప్రాంతాల నుండి వ్యాపారులు మరియు నావికులను ఆకర్షించింది, వీరిలో చాలామంది పట్టణం పరిసరాలలో స్థిరపడ్డారు.

మసీదు చరిత్ర:

కిలకరైను తన నివాసంగా చేసుకున్న వారిలో సాధువుగా మరియు పరోపకారిగా గౌరవించబడ్డ ఒక సంపన్న వ్యాపారి షేక్ అబ్దుల్ ఖాదిర్( అతనిని స్థానికులు ముద్దుగా సీదీ ఖాదిర్ అని పిలుస్తారు) మసీదును ప్రారంభించినట్లు నమ్ముతారు.

సీదీ ఖాదిర్ 17వ శతాబ్దం చివరి భాగంలో కిలకరై  లో ఈ  గొప్ప మసీదును నిర్మించాడు.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో సీదీ ఖాదిర్ బెంగాల్ ఉన్నత స్థాయి పరిపాలకుడు అని ఖాదీ చెప్పారు.

సీదీ ఖాదిర్ ఈ ప్రాంతంలో స్థిరపడిన తర్వాత తూర్పు తీరంలో అనేక మతపరమైన మరియు లౌకిక నిర్మాణాలను నిర్మించాడు. రామనాథపురం జిల్లా ముఖ్య పట్టణం లో స్థానిక రాజా కోసం రామనాథ్ ప్యాలెస్ నిర్మించారు.

సీదీ ఖాదిర్ 17వ శతాబ్దం చివరిలో కిలకరై లో మరణించాడు మరియు కిలకరై జుమా మసీదు ఆవరణలో ఖననం చేయబడ్డాడు. అతని సమాధిని స్థానికులు పూజిస్తారు మరియు ఆశీర్వాదం కోసం సందర్శిస్తారు.

 

No comments:

Post a Comment