28 August 2022

ఒక ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిని బ్రిటీష్ పోలీసులు జైలుకు తరలించడానికి స్వారీ గుర్రాన్ని తీసుకువచ్చారు

 


జమీల్ అహ్మద్ ఖాన్  కుటుంబ సబ్యులు


 బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించారు. భారత  ప్రజలను, వనరులను మరియు సంపదను దోపిడీ చేశారు. అయితే అసాధారణమైన సాహసం, పరాక్రమం మరియు స్ఫూర్తితో మాత్రుభూమిని విముక్తి చేసిన, భారత స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో ఒకడైన జమీల్ అహ్మద్ ఖాన్ కథ మనకు ఎంతో ధైర్యం, భావోద్వేగం మరియు దేశభక్తితో నిండిన  స్ఫూర్తినిస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలోని బెత్రా గ్రామానికి చెందిన జమీల్ అహ్మద్ ఖాన్ ఒక తీవ్రమైన, బహిరంగ బ్రిటిష్ వ్యతిరేక కార్యకర్త.  జమీల్ ఖాన్  అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పరిగణించబడిన అనేక విప్లవ కార్యకలాపాలలో పాల్గొన్నాడు. జైలు శిక్ష అనేది   భార్య తట్టుకోలేదని ఆమె వేరొకరితో వివాహం చేసుకోవడానికి విడాకులు తీసుకున్నాడు.

బ్రిటీష్ పోలీసులు జమీల్ ఖాన్ ను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు, జమీల్ అహ్మద్ ఖాన్ తన్న చేతికి సంకెళ్ళు వేయడానికి నిరాకరించాడు, "నా మాతృభూమిని విముక్తి చేసే పోరాటంలో ఖైదీగా ఉండటం గౌరవం, కానీ నేను చేతికి సంకెళ్ళు వేయవద్దు. నేను జైలుకు వెళ్తాను. అది గుర్రం మీద మాత్రమే ఎందుకంటే అది నాకు శిక్ష కాదు, కానీ వేడుక మరియు ఆనందం. ఫలితంగా, బ్రిటిష్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ఒక గుర్రాన్ని తీసుకువచ్చారు  మరియు అతనిని జైలుకు తరలించారు..

జమీల్ అహ్మద్ ఖాన్ ఏకైక కుమార్తె, శ్రీమతి జబ్బరున్నీసా కు నలుగురు కుమారులు వారు వరుసగా జలాల్ అహ్మద్ ఖాన్ (1984లో సౌదీ అరేబియాలోని మక్కాలో మరణించారు), నియాజ్ అహ్మద్ ఖాన్, నిసార్ అహ్మద్ ఖాన్, ఫయాజ్ అహ్మద్ ఖాన్ మరియు ఇద్దరు కుమార్తెలు రజియా మరియు జరీనా.

ఇటివల  75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా బెతారా లో సుల్తాన్‌పూర్ జిల్లా ఉన్నతాధికారులు జమీల్ అహ్మద్ ఖాన్ యొక్క జీవించి ఉన్న బంధువులను సందర్శించి, వారి పూర్వీకుల కృషికి గుర్తింపుగా ప్రమాణ పత్రాన్ని అందించారు.

 

 

 

No comments:

Post a Comment