15 November 2022

లెఫ్టినెంట్ భారతి 'ఆశా' సహాయ్ చౌదరి INA Lt Bharati ‘Asha’ Sahay Choudhry of INA

 


భారతదేశంలో దేశభక్తి అనేది బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా నిలబడటానికి లక్షలాది మంది సాధారణ భారతీయులను ప్రేరేపించిన శక్తివంతమైన ఆలోచన."నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను" అనే పిలుపుతో వారు నివసించే ప్రతిచోటా భారతీయులను నేతాజీ సుభాష్ బోస్ ఉత్తేజ పరిచారు.

లెఫ్టినెంట్ భారతి ఆశాసహాయ్ చౌదరి 1928లో జపాన్‌లోని కోబ్‌లో జన్మించారు. ఆశాసహాయ్ చౌదరి తండ్రి ఆనంద్ మోహన్ సహాయ్, ఆజాద్ హింద్ ప్రభుత్వ మంత్రివర్గంలో మంత్రి మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు రాజకీయ సలహాదారు.

ఆనంద్ మోహన్ సహాయ్ 1920లలో జపాన్‌కు వెళ్లి కోబ్‌లో భారత జాతీయ కాంగ్రెస్ శాఖను ప్రారంభించే ముందు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ సన్నిహిత సహచరుడు కూడా. ఆనంద్ మోహన్ సహాయ్, రాష్ బిహారీ బోస్‌తో సన్నిహితంగా పనిచేశాడు మరియు 1943లో నేతాజీని జపాన్‌కు తీసుకురావడంలో మరియు ఆసియా అంతటా ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ శాఖలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. నేతాజీతో పాటు అండమాన్‌ దీవులకు విముక్తి లభించినప్పుడు అండమాన్‌లో అడుగు పెట్టిన రెండో వ్యక్తి.

బ్రిటీష్ పాలనలో ఉన్న భారత  దేశాన్ని విడిపించేందుకు తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన ఆశా-సాన్ జపాన్‌లో పెరిగారు. ఆశా-సాన్ మరియు ఆమె తోబుట్టువులను ఆశా-సాన్ తల్లి సతీ నీ సేన్, (దేశబంధు చిత్తరంజన్ దాస్ మేనకోడలు), రెండోవ  ప్రపంచ యుద్ధ క్లిష్ట పరిస్థితుల్లో పెంచారు.

అమెరికాకు చెందిన B-29 బాంబర్లు  జపాన్ పై అగ్ని వర్షం కురిపిస్తున్నాయి. ఆహారం కొరతగా ఉంది, జపాన్ యుద్ధంలో ఓడిపోతోంది మరియు నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) కూడా ఇంఫాల్ యుద్ధంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 1945 వసంతకాలములో  నేతాజీ మరియు అతని అనుచరులు బ్రిటిష్ వారితో పోరాడటానికి సిద్ధమవుతున్నారు.

జపాన్ లొంగిపోయిన తరువాత, ఆశా తండ్రి INA యొక్క ఇతర సభ్యులతో పాటు సింగపూర్‌లో ఖైదు చేయబడ్డాడు. ఆశా తన 15వ ఏట నేతాజీని తన తల్లి సతీ నీ సేన్ సహాయ్‌తో కలిసింది. సతీ నీ సేన్ దేశబంధు చిత్తరంజన్ దాస్ మేనకోడలు మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంది. సతీ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క శాంతినికేతన్‌లో చదువుకుంది మరియు చిన్నప్పటి నుండి ఆశాలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.

INA యొక్క రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరడానికి వాలంటీర్ గా చేరడానికి  ఆశా-సాన్ తన తండ్రితో కలిసి ఫార్మోసా (తైవాన్), సైగాన్ గుండా అనేక వారాల ప్రయాణం తర్వాత, చివరకు మణిపూర్  నుండి నేతాజీ క్యాంప్ చేస్తున్న థాయ్‌లాండ్‌లోని INA క్యాంపుకు చేరుకుంది..

థాయ్‌లాండ్‌లో ఆశా-సాన్ సైనిక శిక్షణ ప్రారంభమవుతుంది. కానీ INA సైనిక శిక్షణ శిబిరం కూడా వైమానిక దాడికి గురవుతుంది. ఆశా-సాన్ సైనిక శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నప్పుడు, వేసవి చివరలో అమెరికా, జపనీస్ నగరాలపై అణుబాంబులు వేసి మిలియన్ల మందిని చంపిందనే వార్త వస్తుంది.

1945 ప్రారంభంలో ఆశా అధికారికంగా ఝాన్సీ రెజిమెంట్‌లోని రాణిలోకి చేర్చబడింది. ఆశా బ్యాంకాక్‌లో శిక్షణ పొందింది మరియు జపనీస్ లొంగిపోయిన తర్వాత జైలు పాలైంది.

నేతాజీ టోక్యో వెళ్లారు  మరియు మార్గమధ్యంలో విమాన ప్రమాదంలో మరణిస్తారు.  నేతాజీ చితాభస్మాన్ని కల్నల్ హబీబ్ ఉర్ రెహమాన్ మరియు శ్రీ AS అయ్యర్ టోక్యో లోని ఆశా-సాన్ ఇంటికి తీసుకువెళ్లారు.అక్కడ ఆశా-సాన్ తల్లి ఉన్నారు.

ఆశా-సాన్ తల్లి అప్పుడు ఇలా గుర్తుచేసుకుంది: సెప్టెంబర్ ప్రారంభంలో, మా ఇంటి ముందు ఒక కారు అకస్మాత్తుగా ఆగింది. నేను బయటికి వెళ్లి కల్నల్ హబీబ్, శ్రీ అయ్యర్ మరియు రామమూర్తి అక్కడ నిలబడి ఉండడం  చూశాను.హబీబ్ భాయ్ ఇలా అన్నాడు: సోదరి, నేను నేతాజీని తీసుకొచ్చాను. నేనేం చేయాలి?’ అన్నారు. నేతాజీ కోసం, ఆయనను ప్రేమించేవారి కోసం సహాయ్ ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది.అని ఆశా-సాన్ తల్లి పలికింది. కల్నల్ హబీబ్, శ్రీ అయ్యర్ మరియు రామమూర్తి మొదలైన వాళ్లంతా లోపలికి వచ్చారు. హబీబ్ భాయ్ మా లివింగ్ రూమ్ షోకేస్ లో కలశం పెట్టాడు. మేము ధూపదీపాలను వెలిగించి, నివాళులర్పించాము. సెప్టెంబర్ 18, మేము నేతాజీ అస్థికలను రెంకో-జీ ఆలయానికి తీసుకెళ్లాము. నాచియప్పన్‌కి నేతాజీ అస్థికలను రెంకో-జీకి తన చేతుల్లో మోసే అదృష్టం కలిగింది. మధ్యాహ్నం, మా నిశ్శబ్ద ఊరేగింపు ఇంటి నుండి బయలుదేరింది మరియు మేము రెంకో-జి ఆలయానికి మూడు కిలోమీటర్లు నడిచాము. రెంకో-జి యొక్క ప్రధాన పూజారి రెవ. మోచిజుకీ మరియు మరో ఆరుగురు పూజారులు కలిసి నేతాజీ అంత్యక్రియలు నిర్వహించారు. భారతదేశం నుండి ఎవరైనా వచ్చే వరకు నేతాజీ అస్థికలను భద్రంగా ఉంచమని ఆశా-సాన్ తల్లి రెవ. మోచిజుకీని అభ్యర్థించారు. రెవ. మోచిజుకీ కలశం తాకడానికి ఎవరినీ అనుమతించబోమని ప్రతిజ్ఞ చేశాడు.

ఆ కలశం ఇప్పటికీ టోక్యోలోని రెంకో-జీ ఆలయంలో ఉంది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో సహా అనేక మంది భారతీయ ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారు, కానీ ఎవరూ అస్థికలను వెనుకకు దేశానికి తిరిగి తీసుకురాలేదు.

ఆశా ఏప్రిల్ 1946లో తన తండ్రితో తిరిగి కలిశారు మరియు ఆశా మామ, INA ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేసిన సత్యదేవ్ సహాయ్‌తో వారందరూ కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశాన్ని విముక్తి చేయడానికి INA చేస్తున్న ప్రయత్నాలను ప్రచారం చేస్తూ ముగ్గురు భారతదేశంలో పర్యటించారు.

లెఫ్టినెంట్ భారతి ఆశా సహాయ్ చౌదరి డైరీ, 1943 మరియు 1947 మధ్య జపనీస్ భాషలో వ్రాయబడింది, ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమం యొక్క అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత ఆధారలలో ఒకటి.

ప్రస్తుతం ఆశాకు 94 సంవత్సరాలు మరియు కుమారుడు సంజయ్ చౌదరి మరియు కోడలు రత్నతో కలిసి పాట్నాలో నివసిస్తున్నారు

No comments:

Post a Comment